గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఇక ఈఏడాదిమరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో.. ప్రభుత్వం.. ప్రభుత్వ విధివిధానాలు, అందులో ఉండే లొసుగులను రిపబ్లిక్ సినిమాతో చూపించనున్నట్టు అర్థమవుతుంది. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా ఓటీటీ వేదిక గా విడుదల అవుతుందని మొదటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తుండడంతో.. రిపబ్లిక్ మేకర్స్ కూడా ఆ దిశగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్ వినిపించింది. ఇక దీనిపై చిత్రయూనిట్ తో పాటు సాయి తేజ్ కూడా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. సినిమా ను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి రిపబ్లిక్ ను చూసి ఎంజాయ్ చేయాలని.. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నామని తెలిపాడు.
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: