యాక్షన్ హీరో గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్ “. 2017 సంవత్సరం జూన్ 9 వ తేదీ రిలీజ్ కావాల్సిన “ఆరడుగుల బుల్లెట్” మూవీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తో నిలిచిపోయింది. ఇక ఇన్నేళ్ల తరువాత ఈసినిమా రిలీజ్ కు మోక్షం కలిగింది. ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈలోపు ఎలాగూ థియేటర్లు రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఓపని అయిపోతుంది అని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సీటీమార్ సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: