“ఉప్పెన “మూవీతో కృతి శెట్టి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో మూడు నెలల క్రితం కృతిశెట్టి ముంబై కి చేరుకున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంతో షూటింగ్స్ ప్రారంభం కావడంతో కృతి శెట్టి వర్క్ లో పాల్గొనడానికి సిద్ధం అంటూ తన బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























