పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే సుధీర్బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ నుండి గ్లింప్స్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు సుధీర్. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు సుధీర్ బాబు. ఈవిషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తను డబ్బింగ్ చెబుతున్న ఒక చిన్న వీడియోను షేర్ చేస్తూ డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way 😃 😎
#70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk
— Sudheer Babu (@isudheerbabu) June 26, 2021
కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈసినిమాతోపాటు సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సుధీర్బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: