నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్. యాభై మంది అభిమానులను ఎంపిక చేసి వారికి స్పెషల్ షో వేసి ఈ సినిమాను చూపించబోతున్నారట. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా ప్రకటించనప్పటికి, ప్రస్తుతం యాభై మంది అభిమానులను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు నిర్మాత సుధీర్ చంద్ర పాదిరి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
I will personally invite everyone whoever is asking me for a update to see the film in my edit room soon. Say who!
— Sudheer Chandra (@sudheerbza) June 25, 2021
కాగా ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: