టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో రాధేశ్యామ్ సినిమా దాదాపు పూర్తయిపోయినట్టే. కరోనా, లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి రిలీజ్ అయ్యేది కానీ కొద్ది రోజులు మాత్రమే పెండింగ్ ఉండగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకూ ఆ షూట్ పెండింగ్ లో పడిపోయింది. ఇన్ని రోజుల గ్యాప్ తరువాత ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. హైద్రాబాద్ లో నేడు ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను మొదలు పెట్టారు. తొందరగా షూటింగ్ ను పూర్తిచేసి రిలీజ్ కు సిద్దం చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాను కూడా ప్రభాస్ స్థాయిని బట్టే తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 26 సెట్లు నిర్మించగా బడ్జెట్ లో ఎక్కువ శాతం వాటికే ఖర్చు చేసినట్టు సమాచారం.
రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. మరి జులై 30న ఈ సినిమా విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు మరి ఇదే రిలీజ్ డేట్ ఉంటుందో లేకపోతే డేట్ మార్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: