ఇన్ని రోజులు సెకండ్ వేవ్ తో టాలీవుడ్ లో సందడి లేకుండా పోయిందా. షూటింగ్స్ రద్దవ్వడంతో అందరూ ఇంట్లోనే రెస్టింగ్ మోడ్ లో ఉన్నారు. ఇక సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో షూటింగ్ స్టార్ట్ చేస్తోంది టాలీవుడ్.. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ను మొదలు పెట్టగా.. వచ్చే నెలకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చేస్తాయి. చెప్పిన డేట్ కే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నాని కూడా శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ను తొందర్లో మొదలుపెట్టనున్నాడు. అయితే ఈసారి సినిమాకు ఎలాంటి బ్రేకులు రాకుండా ఉండటానికి చూస్తున్నాడట నాని. ఇప్పటికే సెకండ్ వేవ్ బ్రేక్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడమే కాదు ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ వర్షాలకు డ్యామేజ్ అవ్వడంతో కోట్ల నష్టం జరిగింది. దీనితో పాటు ముందు ముందు థర్డ్ వేవ్ కూడా ఉంటుంది అన్న సూచనలు ఉండటంతో ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సింగిల్ లాంగ్ షెడ్యూల్ లోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నాని. ముందు షూటింగ్ పూర్తయితే ఒక పని అయిపోతుందని.. ఒక వేళ లాక్ డౌన్ మళ్లీ ఉన్నా ఆ టైమ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవచ్చని చూస్తున్నాడట.
కాగా టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: