కరోనా సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండటంతో మరింత ముందుకొచ్చి మరీ సామాన్య ప్రజలకు ఏ అవసరం ఉన్నా సాయం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు. నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు తనవంతు సహాయం చేశారు రానా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా ఒకపక్క..మరోపక్క లాక్ డౌన్ ఇలా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి రావడంతో ప్రాథమిక అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్న గ్రామాల మొత్తం సమూహంలోని ప్రజలకు అవసరమైన కిరాణా సామాగ్రి మరియు మందులు అందించారు. మొత్తం అల్లంపల్లి మరియు బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతి మరియు గుర్రం మధిర, పాల రేగడి, అద్దాల తిమ్మపూర్, మిసాల భూమన్న గూడెం, గగన్నపేట, కనిరాం తాండా, చింతగూడెం, గోంగూరం గూడ మరియు కడెం మండలాలతో కూడిన కుగ్రామాలకు రానా ఈ సహాయం అందించారు.
ఇక రానా ప్రధాన పాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాట పర్వం రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. మరోవైపు పవన్ తో కలిసి మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. ఇక వీటితో పాటు తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీహెచ్ రాంబాబుతో కలిసి ఈసినిమాను విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: