క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం, అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తనవర్కౌట్ వీడియోస్ ను లావణ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో లావణ్య పర్వత ప్రాంతాలకు టూర్ కు వెళ్ళి , సరదాగా కొండలు, గుట్టల్లో సంచరిస్తూ , ప్రకృతిని ఆస్వాదిస్తున్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: