రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో వస్తున్న సినిమా ‘అర్ధ శతాబ్దం’. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది ఈసినిమా. మరి ఈసినిమా లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయే ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ఈసినిమాకు మొదటిగా అంత క్రేజ్ రావడానికి హీరోగా చేస్తున్న కార్తీక్ రత్నం. కేరాఫ్ కంచరపాలెం సినిమాలో జోసెఫ్ లాంటి పాత్రను పోషించిన కార్తీక్ రత్నం ఈసినిమాలో ప్రఘానపాత్రోల నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.
* ఇక ఈసినిమాపై ఇంట్రెస్ట్ కలగడానికి మరో కారణం కథ. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ డిఫరెంట్ కథతో సినిమా వస్తుందని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా విభిన్నంగా ఉంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
* ఈసినిమాకు హీరో తో పాటు ఇతర పాత్రలకు కీలక నటులనే తీసుకున్నారు. అలాగే కమ్యూనిస్ట్ లీడర్ గా సాయి కుమార్.. అజయ్ ఇంకా నవీన్ చంద్ర పోలీస్ పాత్రల్లో. సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ పొలిటికల్ లీడర్ గా ఇలా స్ట్రాంగ్ కాస్టింగ్ తో వస్తుంది ఈసినిమా.
* ఇంకా ప్రస్తుతం ఎలాగూ థియేటర్లు లేవు. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చిన్న సినిమాలకు ఓటీటీ బెటర్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈనేపథ్యంలో ఎన్నో అంచనాలతో ఈసినిమా రేపు అమెజాన్ లో స్ట్రీనింగ్ కాబోతుంది.
కాగా ఈ సినిమాలో సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: