బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. మేకప్ లేకుండా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “, “శ్యామ్ సింగ రాయ్ “మూవీస్ తనకి మరింత పేరు తెస్తాయనే కాన్ఫిడెన్స్ తో సాయి పల్లవి ఉన్నారు .హీరోయిన్ కు అధిక ప్రాధాన్యం ఉన్న మూవీస్ కై ఫిల్మ్ మేకర్స్ సాయి పల్లవి నే సంప్రదిస్తున్నారు. హీరోలకి సమానంగా సాయి పల్లవి కోసం పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలే బెస్ట్ అనుకొని సాయి పల్లవి పెద్ద హీరోల చిత్రాలలో చిన్న పాత్రలు చేసేందుకు అంగీకరించడం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: