స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే సాధారణంగా ఆసినిమాలపై పలు వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకొక్క అడుగువేసి టైటిల్ ఇదై ఉండొచ్చు అని.. అలానే మేకర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా మ్యాన్ మేడ్ పోస్టర్స్ ను తయారు చేస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి కూడా పలు వార్తలు మొదలయ్యాయి. దీనితో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా టైటిల్ కానీ ఫస్ట్ లుక్ ను కానీ ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. టైటిల్ ని ఖరారు చేసారని.. పవన్ పాత్ర ఇలా ఉండబోతోందని.. హీరోయిన్ ఈమె అని.. ఇప్పుడు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ”ఉగాది పండుగకు టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కాని కరోనా కారణంగా దానిని వాయిదా వేశాం. సోషల్ మీడియాలో ఈసినిమా గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుండటం సంతోషం. కాని అఫీషియల్ అప్డేట్స్ ఏవైనా సరైన సమయంలో ఎక్స్ క్లూజివ్ గా మా హ్యాండిల్స్ నుండి వస్తుందని గుర్తుంచుకోండి!” అని మైత్రీ టీమ్ ప్రకటనలో తెలిపారు.
#PSPK28 😊 pic.twitter.com/BhpRrBZkw3
— Mythri Movie Makers (@MythriOfficial) June 8, 2021
కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమా . ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది .రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: