బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి, ప్రేక్షకులను ఫిదా చేశారు. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదనీ , మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందనీ , మేకప్ లేకుంటేనే బాగుంటాననీ చెప్పే సాయి పల్లవి “ప్రేమమ్” చిత్రం లో నటించడానికి ముందు తన ముఖంపై మొటిమలతో ఆందోళన చెందాననీ , మొటిమలు తగ్గడానికి చాలా క్రీములు వాడాననీ , అయినా అవి తగ్గలేదనీ, ఆ మూవీ విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందన తన ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చిందనీ , ఆత్మవిశ్వాసంతో ఉండడమే నిజమైన అందం అని అర్థం చేసుకున్నాననీ , మనం మనలా ఉండగలగడమే నిజమైన అందం అని తెలుసుకున్నాననీ సాయిపల్లవి చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: