ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ గా ఉన్న పూజాహెగ్డే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో పూజాహెగ్డే తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బేసిగ్గా మనకు కావాల్సింది కూడా ఇదే అంటూ తాజాగా పూజా హెగ్డే తన అమ్మమ్మ ఒడిలో సేదతీరుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా తల్లికి కూతురే, బామ్మకు మనవరాలే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ” #VIJAY65″ తమిళ మూవీ లో ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: