ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నఅనతికాలంలోనే క్రేజీ హీరోయిన్గా మారింది. ఆతరువాత ‘గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు. భీష్మ ఇలా వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాతో తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దాదాపు 18 మిలియన్స్ వ్యూయర్ షిప్ ఉంది. ఇలా పలు విషయాల్లో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టే దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కాబట్టే నేషనల్ క్రష్ అయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా మరోసారి ఎంపికైంది. బెంగుళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 గా రెండోసారి మొదటిస్థానంలో నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది. ఇంకా శర్వానంద్ హీరోగా వస్తున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో కూడా నటిస్తుంది.ఇక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: