బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.కృతిశెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీలో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోడల్ , డబ్ మాష్ వీడియో క్లిప్స్ తో సోషల్ మీడియా లో స్టార్ గా మారిన కేతిక శర్మ ఆకాష్ పూరి కథానాయకుడిగా రూపొందిన “రొమాంటిక్ “మూవీ లో కథానాయికగా నటించారు. “రొమాంటిక్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న కేతిక శర్మ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. కేతిక ప్రస్తుతం నాగశౌర్య హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందే మూవీ లో కేతిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.ఈ విధంగా కృతి శెట్టి , కేతిక శర్మ టాలీవుడ్ లో బిజీగా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: