తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న రాశీఖన్నా 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రాశీఖన్నా నటించిన “భ్రమమ్ “మలయాళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నాగచైతన్య “థ్యాంక్ యు “, గోపీచంద్ “పక్కా కమర్షియల్ ” మూవీస్ లో రాశీఖన్నా నటిస్తున్నారు.“పక్కా కమర్షియల్” మూవీ లో తన క్యారెక్టర్ గురించి రాశీఖన్నా మాట్లాడుతూ .. తన పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో ప్రయాణాలు చేయడానికి ఎవరూ సాహరించరు. ఈ తరుణం లో ప్రయాణాలు చేసే ఛాన్స్ వస్తే ఎవరు వెళతారు, ఎక్కడికి వెళతారు అంటూ రాశీఖన్నా తన ఫాలోవర్స్ ను అడుగుతూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టగా , ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: