గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల ..వైకుంఠపురములో.. “మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పనలో సాంగ్స్ కు విశేష ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే. ప్రతీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేశాయి . “అల ..వైకుంఠపురములో.. “మూవీ ఆల్బమ్ 2 బిలియన్స్ మార్క్ క్రాస్ చేసి దక్షిణాది సినిమాలలో ఫస్ట్ ఎవర్ రికార్డ్ ను స్వంతం చేసుకుంది. అల్లు అర్జున్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ , పూజాహెగ్డే తన అందం తో
ప్రేక్షకులను అలరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ “అల..వైకుంఠపురములో..”మూవీనీ అద్భుతం గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: