టాలీవుడ్ లో మరో నటడు కరోనా బారిన పడ్డాడు. ఈ నటుడు ఎవరో కాదు సోనూ సూద్. సోనూ సూద్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈవిషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్త చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. దీంతో సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
— sonu sood (@SonuSood) April 17, 2021
గత ఏడాది కరోనా సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సాయం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి హీరో అనిపించుకున్నాడు.
సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుటుంది. ఇక దీనితో పాటు మరికొన్ని సినిమాలతో కూడా సోనూసూద్ బిజీగా ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: