కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్ టీమ్ కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత మరికొందరికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న తన స్పీచ్ తో టాప్ వన్ ట్రెండింగ్ లో నిలిచిన బండ్ల గణేష్ రెండోసారి కోరోనా బారిన పడ్డారు. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గత కొద్దిరోజులుగా ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం… కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/089nooZUlV— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఇంకా హరీష్ శంకర్ తో కూడా మరో సినిమా చేయనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: