నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన “లవ్ స్టోరీ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక. హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో నటిస్తున్నారు. హీరో నాగచైతన్య కు జోడీగా అందాల రాశీఖన్నా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న రాశీఖన్నా కోలీవుడ్ లో పలు మూవీస్ లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “వెంకీ మామ”మూవీ లో నాగచైతన్యకు జంటగా ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా మరోసారి “థ్యాంక్ యు ” మూవీ తో అలరించనున్నారు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న “పక్కా కమర్షియల్ “మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: