ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని ప్రత్యేక సెట్ లో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అల్లు అరవింద్ హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తున్న సమంత మాట్లాడుతూ .. అన్ని పాత్రలలోనూ నటించానుగానీ , పౌరాణిక పాత్రలో నటించలేదనీ , తన డ్రీమ్ రోల్ పీరియాడికల్ రోల్ అనీ , శకుంతల పాత్రను పోషించడం ఆనందంగా ఉందనీ , తన కెరీర్ లో శకుంతల పాత్ర మరిచిపోలేని గొప్ప బహుమతి అనీ , దర్శకుడు గుణశేఖర్ “శాకుంతలం “మూవీ లోని ప్రతీ సన్నివేశాన్నీ అద్భుతంగా వివరించారనీ
సమంత చెప్పారు.భారీ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రణయ కావ్యం “శాకుంతలం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: