ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలు యాడ్ లలో కూడా నటిస్తూ పలు పొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒకటి కాదు రెండు కాదు పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ చేసినన్ని యాడ్స్ మరే హీరో కూడా చేయడని చెప్పొచ్చు. ఇక నేడు మరో యాడ్ షూట్ షురూ చేశాడు. ఇక ఈయాడ్ షూట్ చేసేది ఎవరోకాదు తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా. మహేష్ బాబు హావెల్స్ బ్రాండ్ యాడ్ కోసం డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇందులో మహేశ్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. ఈరోజు ఈ యాడ్ షూటింగ్ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ‘ఆగడు’లో మహేష్ సరసన నాయికగా నటించిన తమన్నా… గత యేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’లో స్పెషల్ సాంగ్ చేసింది. మరోసారి ఈయాడ్ తో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ తమన్నాకు వచ్చింది.
మహేష్ ప్రస్తుతం పరుశురాం తో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దుబాయ్ లో చాలా రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: