మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యంగ్ హీరోల సినిమా వేడుకలకు చీఫ్ గెస్ట్గా వెళుతూ వారికి తన వంతు సపోర్ట్ కూడా అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆచార్య కీలక షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ గ్యాప్ లో ట్రిప్ కూడా ప్లాన్ చేశాడు. ఈ సారి చిరంజీవి వీకెండ్ టూర్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరు ట్రిప్ కు వెళుతుంది ఫ్యామిలీతో కాదు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో. ఇక ఈవిషయం అటు చిరు-మోహన్ బాబు ఫ్యాన్స్ కు ఎంత సంతోషానిస్తుందో మంచు ఫ్యామిలీకి కూడా అంతే హ్యాపీగా ఉన్నట్టుంది. అందుకే మంచు లక్ష్మీ, మంచు మనోజ్ ఇద్దరూ తమ ట్విట్టర్ల ద్వారా ఈవిషయాన్ని తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంచు మనోజ్ కూడా తన ట్విట్టర్ లో “సిక్కింలో బిల్లా రంగా.. మీలో ఎంత మంది ఈ కాంబినేషన్ గురించి ఎదురుచూస్తున్నారు. చిరంజీవిగారిని, నాన్నగారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు మనోజ్. ఇక మంచు లక్ష్మీ కూడా “ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు శీఘ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు.. అదొక ఫైరింగ్ న్యూస్ అవుతుందని మీకు తెలుసు. చిరంజీవి అంకుల్..మీరు మాత్రమే నాన్నను వీకెండ్ క్విక్ ట్రిప్లో సిక్కింకు వెళ్లడానికని ఒప్పించగలిగారు. ఈ విషయంలో నేను అసూయ పడుతున్నాను అంటూ ట్వీట్ చేసింది.
Sikkim lo #BillaRanga 😎🔥
Well how many of you are waiting for this combo ?! Soo good to see @KChiruTweets garu and Nanna garu having their time off 🤗❤️ pic.twitter.com/6BYBXxiHij— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 15, 2021
మరోవైపు మోహన్ బాబు కూడా రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: