గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఒక చిన్న గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తూ టీజర్ అప్ డేట్ కూడా ఇచ్చారు. మార్చి 28వ తేదీన టీజర్ రిలీజ్ చేయనున్నారు.
On his Birthday. He inspires us!
A glimpse from #MajorTheFilm ▶️https://t.co/lpSYw6Pfyu
Unveiling #MajorTeaserOnMarch28th 🔥#MajorOnJuly2 @AdiviSesh @SashiTikka @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @sonypicsindia @AplusSMovies @vivekkrishnani @sonypicsfilmsin
— GMB Entertainment (@GMBents) March 15, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల `దబాంగ్ 3`బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: