సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ఉప్పెన’. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు. ఈ లోపు ఈ సినిమాకు నీ కళ్లు నీలి సముద్రం అన్న పాట కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం మంచి క్యూరియాసిటీతోనే ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలే కారణం. అంతేకాదు వర్సటైల్ యాక్టర్ విజయసేతుపతి నెగిటివ్ పాత్ర చేయడం కూడా ఒక కారణం. ఇంకా ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎలాగూ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉండతంతో ఈ గ్యాప్ లో ఛాన్స్ దొరికినంత ప్రమోషన్స్ చేసుకుంటున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. 2 గంటల 27 నిమిషాల నిడివి వచ్చిన ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. హీరో హీరోయిన్ నటన బావుందని.. విజయసేతుపతి నటన.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అన్న టాక్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: