“భీష్మ “మూవీ ఘనవిజయం సాధించడంతో జోష్ లో ఉన్న నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే . భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ , రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలోరూపొందిన థ్రిల్లర్ మూవీ “చెక్ ” ఫిబ్రవరి 19 వ తేదీ రిలీజ్ కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తిసురేష్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెల గ్యాప్ లో నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షక, అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నారు. హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నభా నటేష్ కథానాయిక కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ కి తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న “పవర్ పేట ” మూవీ కి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: