ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో తాను రాజకీయాల్లోకి రానని చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఇక రజినీ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేసినా.. కొంతమంది అభిమానులు మాత్రం నిరాశచెందారు. అంతేకాదు.. తలైవా తన నిర్ణయం మార్చుకోవాలని నిరసనలు కూడా చేశారు. ఇక దానిపై స్పందించిన రజినీ తాను రాజకీయాల్లోకి రాలేనని.. అర్ధం చేసుకోవాలని కూడా స్పష్టం చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ విషయంలో తలైవా వీరాభిమాని లారెన్స్ కూడా స్పదించాడు. తలైవర్ నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పాల్సిందిగా లారెన్స్ ను పలువురు కోరుతుండటంతో లారెన్స్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. రజినీ సర్ రాజకీయాల్లోకి రాకపోవడంపై మీలానే నేనూ బాధపడ్డాను. కానీ ఆయన వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే మనం ఆయన నిర్ణయాన్ని మార్చుకోమని అడగొచ్చు. కానీ తలైవర్ చెప్పిన కారణం అనారోగ్యం. ఇలాంటి సమయంలో ఒత్తిడి మేరకు ఆయన రాజకీయాల్లోకి వస్తే అప్పుడేదైనా జరగరానిది జరిగితే ఆ బాధను జీవితాంతం మర్చిపోలేం.అయినా రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన మాత్రం ఎప్పటికీ నా గురువే. ఆయనతో సన్నిహితంగా మాట్లాడిన వాడిగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే ఇప్పుడు మనమందరం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని సర్వదా ప్రార్థిద్దాం.. నా ప్రార్థనలు ఎప్పటికీ ఉంటాయి. గురువే శరణం“ అని ట్వీట్ లో పేర్కొన్నాడు లారెన్స్.
My apologies to all Superstar Rajinikanth fans 🙏@rajinikanth pic.twitter.com/PCXABprEcW
— Raghava Lawrence (@offl_Lawrence) January 12, 2021
లారెన్స్ – రజినీ కాంబినేషన్ లో చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. త్వరలోనే ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: