రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ , బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం “లవ్ స్టోరీ “, “విరాటపర్వం “, “శ్యామ్ సింగ రాయ్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇప్పుడు ఒక మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాచి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. ఈనెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ఎంపిక అయ్యారని సమాచారం. హీరో పవన్ కళ్యాణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: