కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిందని చెప్పొచ్చు. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి.. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే వరుసపెట్టి సినిమాలు తీసినట్టు కనిపించాడు. అయితే మనకు తెలియకుండా చాలా మంది సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలవుతున్నాయో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకుడిగా మారి కల్యాణ్ రామ్ హీరోగా.. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన సినిమా `118`. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు గుహన్ మరో డిఫరెంట్ థ్రిల్లర్ కథతో వచ్చేస్తున్నాడు. ఈ చిత్రానికి `డబ్లూడబ్లూడబ్లూ`(హూ,వేర్,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
కాగా అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సిమన్ కె. కింగ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: