కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. ‘ఆచార్య’ చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇన్ని రోజులు పెళ్లి… హనీమూన్ కోసం మాల్దీవ్స్ అంటూ చాలా బిజీ బిజీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టింది కాజల్. అయితే తన భర్త గౌతమ్ తో కలిసి ఆచార్య సెట్ కు వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. దీంతో `ఆచార్య` యూనిట్ కాజల్ దంపతులకు స్వాగతం పలికి విషెస్ తెలియచేశారు. చిత్రయూనిట్ ఎదుట కాజల్, గౌతమ్ దండలు మార్చుకున్నారు. కేక్ కట్ చేశారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్లో చిరంజీవితోపాటు దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, నిర్మాతలు పాల్గొన్నారు.
#Kajal & #GautamKitchlu Took Blessings from @KChiruTweets in the Sets of #Acharya As @MsKajalAggarwal Joined the Sets Today! Shooting Happening in Surroundings of Hyd.@SivaKoratala pic.twitter.com/7wfQ2wcczd
— Suresh Kondi (@V6_Suresh) December 15, 2020
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాలో రామ్చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: