జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది అసలే కరోనా వల్ల అనుకున్న టైం కంటే ఎక్కువ ఆలస్యం అవ్వడంతోబ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేపనిలో పడ్డారు. అలా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారో లేదో.. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కూడా రాధా కృష్ణ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా లో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు రాధా కృష్ణ. రెండేళ్ల కలను నిజం చేయడానికి దాదాపు వెయ్యి మంది నాన్ స్టాప్ గా 100 రోజులు ఈ సినిమా కోసం పనిచేశారు.. ఇంకా ఒక నెల భారీ యాక్షన్ షెడ్యూల్ ఉంది.. ఇంతకుముందు ఎప్పుడు చూడని అడ్వెంచర్స్ ఈ సినిమాలో చూపిస్తున్నందుకు యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ కి అతని టీంకు థ్యాంక్స్.. అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
View this post on Instagram
కాగా 1970 బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ లవ్స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: