యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సీనియర్ హీరోయిన్ శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు . ఈ రోజునుండి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై అలియా భట్ తెలుగు భాష నేర్చుకొనడం విశేషం. నిరీక్షణకు తెర పడింది . హైదరాబాద్ చేరుకున్న అంటూ అలియా భట్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: