పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కియారా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ లో కియారా అద్వానీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం తో కియారా పలు బాలీవుడ్ అవకాకాశాలు అందుకున్నారు. కియారా ప్రధాన పాత్రలో రూపొందిన “ఇందూ కి జవానీ “మూవీ డిసెంబర్ 11 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భరత్ అనే నేను” , “వినయ విధేయ రామ ” మూవీస్ లో కథానాయికగా నటించిన కియారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కియారా ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటించనున్నారని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా”#NTR30″ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కియారా నటించనున్నారని సమాచారం. కియారా ప్రస్తుతం “షేర్ షా “, “భూల్ భులయ్యా 2”, “జగ్ జగ్ జియో “హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: