సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్ ,కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !”మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , కౌసల్య , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత “రంగ్ దే !”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. “రంగ్ దే !”మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోనీతిన్ దుబాయ్ షూటింగ్ లొకేషన్ లోని ఒక సరదా సన్నివేశాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షాట్ గ్యాప్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ముఖం పైన గుడ్డ వేసుకుని కునుకు తీశారు. నిద్రపోతున్న కీర్తి సురేష్ వెనుక దర్శకుడితో ఉన్న తన ఫోటోను నితిన్ షేర్ చేశారు. మేము కస్టపడి చెమటలు కక్కుతుంటే కీర్తి సురేష్ ఇలా రిలాక్స్ అవుతుందంటూ నితిన్ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “రంగ్ దే !”మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: