కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా “అచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. కరోనా కారణంగా నిలిచిపోయిన “ఆచార్య ” మూవీ షూటింగ్ సుమారు 8 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. చిత్ర యూనిట్ అంతా కరోనా టెస్ట్స్ చేయించుకున్న నేపథ్యం లో చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు , సూచనలు చేసిన చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఆందోళనకు గురి అయ్యారు. కరోనా బారిన పడిన చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు , సెలబ్రిటీస్ పూజలు చేశారు. కరోనా టెస్ట్ కిట్ ఫాల్ట్ వల్ల రిపోర్ట్ రాంగ్ గా వచ్చింది. చిరంజీవి తిరిగి మూడు సార్లు టెస్ట్స్ చేయించుకొనడంతో కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.కరోనా టెస్ట్ లలో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందనీ , తన క్షేమం కోసం ప్రజలంతా చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: