అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్’. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. మొదటి షెడ్యూల్ పూర్తిచేసిన చిత్ర యూనిట్ ఇటీవలే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారు. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే హైదరాబాద్లో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s time to celebrate this Diwali with new things. First look of #OdelaRailwayStation will be released tomorrow at 11AM. Stay tuned! #HappyDiwali@ImSimhaa #HebbahPatel#AshokTeja @soundar16 @pujita_ponnada @saironak3 @IamSampathNandi @anuprubens @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/pzPnVUoukD
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) November 13, 2020
ఇక దీపావళి పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని సినిమాల అనౌన్స్ మెంట్స్.. ఫస్ట్ లుక్స్ వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి కూడా సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
కాగా కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తుంది. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. మరి టైటిలే డిఫరెంట్ గా వుంది.. సినిమా ఇంకెలా ఉంటుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: