అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో `గూఢచారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శోభిత తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. లొకేషన్ లో అడివి శేష్, మరో వ్యక్తి ఉన్న ఫొటోతోపాటు డైరెక్టర్ మానిటర్ చెక్ చేసుకుంటున్న ఫొటోలను హీరోయిన్ శోభితా దూళిపాళ్ల షేర్ చేస్తూ.. నా తొలి తెలుగు సినిమా గూఢాచారికి పని చేసిన అదే టీంతో మళ్లీ చేస్తున్నా.. . మేం సంతోషంగా మేజర్ ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నాం.. ఇది ఒక అనాటమీ స్టోరీ లాంటిది అంటూ పోస్ట్ పెట్టింది.
And it’s a wrap for me on ‘Major’
Heart is full 🙂
This is a Déjà vu with drumbeats, we are the exact same team as on Goodachari! (my 1st Telugu film) ❤️
‘Major’ is a passion project that we gladly gave blood, sweat and tears to. I think of this as a story about the anatomy of pic.twitter.com/i9ESNbEQ3u— Sobhita Dhulipala (@sobhitaD) November 10, 2020
కాగా ఈ సినిమాలో `దబాంగ్ 3` బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ కు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: