తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పిల్లలు శివాని, శివాత్మికలు ముందు కరోనా నుండి కోలుకోగా ఇటీవలే జీవిత కూడా రికవరీ అవ్వడంతో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా రాజశేఖర్ హెల్త్ పై ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేస్తూనే వున్నారు సిటీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం. ఇక పిల్లలు శివాని, శివాత్మిక కూడా సోషల్ మీడియా ద్వారా తమ తండ్రి ఆరోగ్యం గురించి అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ హెల్త్ గురించి.. ఆయన హెల్త్ పై వస్తున్న వార్తలు గురించి క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీడియా ముందుకు వచ్చిన జీవిత రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలియజేశారు. రాజశేఖర్కు ఇన్ఫెక్షన్ కొంత తగ్గిందని.. పలు పరీక్షల అనంతరం ఆయనను ఐసీయూ నుంచి కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నారని ఆమె తెలిపింది. రాజశేఖర్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు రాజశేఖర్కు సరైన చికిత్స అందిస్తున్నారని తెలిపింది. మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం కొంత క్రిటికల్గానే ఉండేదని.. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని.. కానీ కొన్ని కొంతమంది మాత్రం రాజశేఖర్ వెంటిలేటర్పై ఉన్నాడని వార్తలు రాస్తున్నారని.. అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జీవిత అప్ డేట్ వల్ల అభిమానులు మాత్రం కాస్త రిలాక్స్ అయ్యారు.
#Jeevitha gives an update about the health condition of her husband actor #Rajasekhar
#TeluguFilmNagar pic.twitter.com/IlEaddQkhL
— Telugu FilmNagar (@telugufilmnagar) November 4, 2020
ఇక గరుడవేగతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: