సూపర్ హిట్ చిత్ర దర్శకుడి శంకర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన “బాయ్స్ “మూవీ తో సిద్ధార్ధ్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “మూవీ తో సిద్ధార్ధ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “బొమ్మరిల్లు “, “జబర్దస్త్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు. “రంగ్ దే బసంతి “, “ఛష్మే బద్దూర్ “సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన సిద్ధార్ధ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు సిద్ధార్ధ్ ఎంపిక అయ్యారు. “మహాసముద్రం ” మూవీలో నటిస్తున్నందుకు సిద్ధార్ధ్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. 8 సంవత్సరాల తరువాత “మహాసముద్రం ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాననీ , అద్భుతమైన టీమ్ తో కలసి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉందనీ , ప్రేక్షకుల దీవెనలు కావాలని సిద్ధార్ధ్ ట్వీట్ చేశారు. “మహాసముద్రం ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: