సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేదలకి ఆయన అండగా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఈ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ జరిగింది. దీనిపై నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ… ఆంధ్రా హాస్పిటల్స్ వారి సహకారంతో ఎంబీఫర్సేవింగ్హార్ట్స్ కార్యక్రమంలో భాగంగా తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్ జరిగిందని, తను సేఫ్గా ఉందని తెలిపారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: