బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో 6 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన భూమి పెడ్నేకర్ బ్లాక్ బస్టర్ “దమ్ లగా కే హైసా “మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. “టాయ్ లెట్ : ఏక్ ప్రేమ్ కథ “, “శుభ్ మంగళ్ సావధాన్ “, “సాండ్ కి ఆంఖ్ “, “పతి పత్ని ఔర్ వో ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “సాండ్ కి ఆంఖ్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి భూమి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ భూమి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ హిందీ రీమేక్ “దుర్గావతి ” మూవీ లో నటిస్తున్నారు. భూమి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక టాప్ హీరో మూవీ కి కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో భూమి మాట్లాడుతూ .. బాలీవుడ్ మూవీస్ తో పాటు ఇతర భాషా చిత్రాలలో నటించాలని ఉందనీ , త్వరలో టాలీవుడ్ లో ఒక బిగ్ హీరో మూవీ లో నటించనున్నాననీ చెప్పారు. మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ టాలీవుడ్ కు పరిచయమవడం ఆనందదాయకమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: