కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వలన షూటింగ్కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేషన్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
And we begin the shoot of our #18Pages 🎥📝
Send in your best wishes for the team 🧡Here is a working still from the sets of #18PagesMovie 🤩#AlluAravind @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @raparthysaran @SukumarWritings pic.twitter.com/5W1h7XsMIw
— GA2 Pictures (@GA2Official) October 20, 2020
ప్రస్తుతం నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా నిఖిల్ లైన్ లో పెట్టాడు. ఏషియన్ గ్రూప్ సంస్థల్లో భాగమైన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీతో పాటు రెయిన్బో రీల్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోనాలీ నారంగ్ సమర్పించనున్నారు. ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: