స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పూజాహెగ్డే నటించిన “హౌస్ ఫుల్ 4” మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా
రూపొందనున్న “కభీ ఈద్ కభీ దివాలీ ” మూవీ కథానాయికగా ఎంపిక అయిన పూజాహెగ్డే మరో బాలీవుడ్ మూవీ కి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి , స్టార్ హీరో రణవీర్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింబా “హిందీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. హీరో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: