మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం `హిరణ్యకశ్యప`సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అయితే, సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు గుణశేఖర్. మరో పాన్-ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహాభారతంలోని ఆదిపర్వంలో అద్భుతమైన, అందమైన ప్రేమ కథను శాకుంతలం చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు గుణశేఖర్. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. వెండితెరపై హిరణ్యకశ్యపలో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ..” అంటూ గుణశేఖర్ తన కొత్త సినిమా గురించి ప్రకటించారు. ‘శాకుంతలం’ అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ లో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’..
Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze— Gunasekhar (@Gunasekhar1) October 9, 2020
కాగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలొడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచనున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. ఈ సినిమా అయిపోయి హిరణ్యకశ్యప సినిమా ఎప్పుడు మొదలవుతుంది. చూడబోతే హిరణ్యకశ్యప సినిమా రావడానికి చాలా టైమే పట్టేలా కనిపిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: