హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా తమ స్కాంలో భాగం చేశారు. అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వీడియోను బన్నీ చేతుల మీదుగా ఈ అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ లో తెలిపాడు.
On 3rd October, My bruh @alluarjun will tell the world the size of our scam #Mosagallu @MsKajalAggarwal @SunielVShetty pic.twitter.com/6IgD7WFI5a
— Vishnu Manchu (@iVishnuManchu) September 30, 2020
కాగా ఇంకా ఈసినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా..నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అను పాత్రలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: