సుజనా రావు దర్శకత్వంలో శ్రియ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘గమనం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక రీసెంట్ గానే శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి శ్రియ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్ లుక్ను హీరో శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిత్యామీనన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Introducing @MenenNithya as singer #ShailaputriDevi from #GAMANAM
Best wishes to @gnanashekarvs and the entire team 😊 pic.twitter.com/f3ACI7kldl
— Sharwanand (@ImSharwanand) September 18, 2020
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియగా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా ఈ చిత్రానికి పనిచేస్తున్న జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాత అవతారం కూడా ఎత్తి, రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
కాగాఈ సినిమా కాకుండా త్వరలోనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో రానుంది నిత్యా. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తుందని టాక్. కరోనా వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ సినిమాను నాలుగు భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: