కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ నెల 21న కార్తికేయ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమాలోని కార్తికేయ పాత్రకు సంబంధించి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఇంకా అజిత్ సినిమాలో కూడా కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా `ఆర్ ఎక్స్ 100` తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: