ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా కానీ ‘ఆదిపురుష్’ సినిమా పై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇక సీత పాత్రపై కూడా పలు హీరోయిన్స్ పేరు తెరపైకి రాగా వాటిపై కూడా చిత్ర యూనిట్ స్పందించి.. ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.. ఫైనలైజ్ చేసి మేమే చెప్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేయాలని ఓంరౌత్ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఎమ్.ఎమ్. కీరవాణి పేరు వినిపిస్తుంది. కీరవాణి ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసిందాకా వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. కరోనా నిబంధనలతో ఆదిపురుష్ టీమ్ ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2022లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: