కేవలం నటి మాత్రమే కాదు.. దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా కూడా రేణు దేశాయ్ కు మంచి పేరుంది. పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక మళ్లీ సినిమాలపై తన దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ డైరెక్షన్ లో సామాజికవేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుంది. హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఇక ఈ సినిమాతో పాటు రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు రైతులను కలిశారు రేణు దేశాయ్. ఈ నేపథ్యంలో తాజాగా గోరటి వెంకన్నను రేణు కలిశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించారు. ‘లిరిక్ సెషన్ కోసం వెంకన్న గారి ఫామ్ కు వెళ్లాను. నా సినిమాలో గోరేటి వెంకన్న గారు పాట రాయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన భార్య మట్టి పాత్రల్లో అన్నం, పప్పు వండారు. రుచికరమైన రోటీ పచ్చడి చేశారు. నాకు పువ్వులకు బదులు… భోంచేయడానికి అరటి ఆకును గిఫ్టుగా ఇచ్చారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక చిన్న వ్యవసాయభూమిలో సాధారణ జీవితం గడుపుతున్న పెద్ద మనుషుల మధ్య గడపడం మంచి అనుభూతిని అందించింది’ అని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: